Sunday, May 19, 2024
- Advertisement -

హ‌రికృష్ణ మ‌ర‌ణంపై స‌మంత ట్వీట్… ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

- Advertisement -

న‌టుడు నందమూరి హరికృష్ణ మ‌ర‌ణ‌వార్త‌తో టాలీవుడ్ విషాదంతో నిండిపోయింది. హరికృష్ణ మ‌ర‌ణంపై టాలీవుడ్ ప్ర‌ముఖులు ఆయనకు సంతాపం తెలిపారు.హీరోయిన్ స‌మంత కూడా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలుపుతు ట్వీట్ చేసింది.ఇప్ప‌డు ఆ ట్వీటే ఆమెకు కొత్త క‌ష్టాలు తెచ్చిపెట్టింది.ఆమె చేసిన ట్వీట్‌పై నెటిజిన్లు మండిప‌డుతున్నారు.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…సమంత చేసిన ఈ ట్వీట్‌లో ఆమె హరికృష్ణను ‘గారు’ అని సంబోధించ లేదు. దాంతో నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.

దాంతో ఆమె ముందు చేసిన ట్వీట్‌ని డిలీట్‌ చేసి, ‘రిప్ హరికృష్ణ గారూ’ అంటూ మరో ట్వీట్‌ చేసింది. అంతేకాక ప్రస్తుతం తాను చెన్నైలో ఉన్నానని, ఓ సినిమా ఫంక్షన్ కోసం అక్కడికి వెళ్లానని కూడా చెప్పింది. ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, కష్టకాలంలో ఆయన కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పింది.కాని అప్ప‌టికే జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.ఆమె చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -