Sunday, May 19, 2024
- Advertisement -

‘మ‌హాన‌టి’ నుంచి ‘మ‌ధుర‌వాణి‘ ఔట్‌

- Advertisement -

జ‌ర్నలిస్ట్‌గా షూటింగ్ పూర్తి చేసుకున్న స‌మంత‌

‘రంగ‌స్థలం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మార్చి 30వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు స‌మంత రామ‌ల‌క్ష్మిగా రాబోతోంది. ఆ సినిమా పూర్త‌య్యిందో లేదో మ‌రో రెండు సినిమాల షూటింగ్‌ల‌ను పూర్తి చేసుకుంది. అందులో ఒక‌టి తెలుగు, ఇంకోటి త‌మిళ్‌. మహాన‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మ‌హాన‌టి’.

ఈ సినిమా షూటింగ్‌ ముగిసింది. వైజయంతి ఫిలిమ్స్‌ బ్యాన‌ర్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో స‌మంత మ‌ధుర‌వాణి అనే జ‌ర్న‌లిస్ట్ పాత్రలో కనిపిస్తోంది. మహానటి సినిమా సెట్‌లో కుర్చీలో కూర్చుని చిన్నపాటి కునుకు తీస్తున్న ఫొటోను స‌మంత ట్వీట్‌ చేసింది. తెలుపు రంగు చీర‌లో చేతికి వాచీ పెట్టుకొని ముద్దుగా క‌నిపిస్తున్నారు. మ‌రీ ఎవ‌ర్నీ ఇంట‌ర్వ్యూ చేసింది? ఆమె ఏ నిజాలు జ‌ర్న‌లిస్ట్‌గా బ‌హిర్గ‌తం చేసిందో మే 9వ తేదీన సినిమాలో చూడాల్సిందే.

ఈ సినిమా త‌ర్వాత త‌మిళ సినిమా ‘ఇరుంబు థిరై’ను కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు రెస్ట్ పొందుతోంది స‌మంత‌. ఒకే నెలలో మూడు సినిమాల షూటింగ్‌ పూర్తి చేసుకున్న న‌టి స‌మంత‌నే.సావిత్రి జీవితం ఆధారంగా తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘మహానటి’, తమిళ్‌లో ‘నడిగర్‌ తిలకం’ అనే సినిమా చేస్తోంది. ఈ విధంగా స‌మంత సినిమాలు చేస్తూ ఈ 2018లో మొత్తం 6 సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -