Wednesday, May 15, 2024
- Advertisement -

ఆఖ‌రికి సీనియ‌ర్ నటిని కూడా వ‌ద‌ల‌ని కామాందులు

- Advertisement -

బాలీవుడ్ నుంచి టాలీవ‌డ్ వ‌ర‌కు #మీటూ ఉద్య‌మం ఉదృతంగా సాగుతుంది.మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగానే మాట్లాడుతున్నారు.టాలీవుడ్ లో చిన్మయి లాంటి వాళ్లు కూడా ఈ ఉద్యమంపై స్పందిస్తున్నారు. ఓ పక్క ఈ ఉద్యమం సాగుతుంటే మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పలువురు వివిధ రంగాల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు.

అయినప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌రో సీనియ‌ర్ న‌టి త‌న‌పై జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి మీడియాతో పంచుకుంది. సీనియర్ నటి రాణి తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.తమిళంలో ఓ సీరియల్ చిత్రీకరణ సమయంలో సహ నటుడు షణ్ముగరాజన్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని సెంగుడ్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -