Monday, April 29, 2024
- Advertisement -

విరామం నాకు నేనుగా తీసుకున్నదే.. శృతిహాసన్!

- Advertisement -

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన “క్రాక్” మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకొని ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ హిట్ మూవీ “వకీల్ సాబ్” మూవీలో గెస్ట్ రోల్లో కనిపించింది. ప్రస్తుతం కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘సలార్’లో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

శృతిహాసన్ టాలీవుడ్ ,బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న సమయంలోనే ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో ప్రేమలో పడి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి ప్రేమకు బ్రేక్అప్ చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ విరామం అనేది నాకు నేనుగా తీసుకున్నదే. అది నన్ను నేను ఎంతగానో మార్చుకోవడానికి తీసుకున్న నిర్ణయం.అంటూ చెప్పుకొచ్చింది.

Also read:థ్రిల్లింగ్‌ కథతో చేయడానికి సిద్ధమైన చందమామ!

అలాగే విరామ సమయంలో నాకిష్టమైన సంగీతంపై దృష్టి పెట్టి దాంట్లో కొంత ప్రావీణ్యం సంపాదించాను.అటు నటనను, ఇటు నాకు ఇష్టమైన సంగీతాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్న విషయంపై శ్రద్ధ పెట్టాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ వెండితెరపైన సినిమాల్లోనే కాకుండా “కాఫీ ఎనీవన్‌” అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించింది. అలాగే “పిట్టకథలు ” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం నా కెరియర్ చాలా బిజీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

Also read:లక్కీ ఛాన్స్ కొట్టేసిన..ఫరియా అబ్దుల్లా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -