- Advertisement -
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్లో బిజీగా ఉన్నాడు.వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డె నటిస్తుంది.తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ని తీసుకున్నారని తెలుస్తుంది.బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తెలుగులో బాలకృష్ణతో కలిసి లెజెండ్, డిక్టేటర్ వంటి సినిమాలలో నటించింది.
అయినప్పటికీ తెలుగులో ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పుడు మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.సినిమాలో మహేష్ బాబు స్టూడెంట్ గా, వ్యాపారవేత్తగా, రైతుల సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా ఇలా మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు,పీవిపి,అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏప్రిల్కు విడుదల చేయనున్నారు.