- Advertisement -
మీటూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.సీనియర్ నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కానీ అర్జున్ తమకి ఎప్పటి నుంచో తెలుసుననీ, ఆయన చాలా మంచివాడని చాలామంది సినీ ప్రముఖులు సమర్థిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆమెకి మద్దతు తెలుపుతున్నవారికంటే ఆమెని విమర్శిస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు.దీంతో ఈ వ్యవహారంపై శ్రుతి మరోసారి స్పందించింది.
తన వద్ద ఆధారాలు ఉన్నాయని, కేసు ఫైల్ అయితే వాటిని కోర్టులో సమర్పిస్తానని బాంబ్ పేల్చింది శ్రుతి. ‘అర్జున్ పై నేను చేసిన ఆరోపణలపై చాలా క్లియర్ గా ఉన్నాను.ఈ విషయంలో నన్ను విమర్శిస్తోన్న వాళ్లకి నేను సాక్ష్యాలు చూపించవలసిన అవసరం లేదు. ఈ వ్యవహారం కోర్టువరకూ వెళితే అక్కడ ఆధారాలు సమర్పిస్తాను” అని చెప్పుకొచ్చారు.