తెలుగులో కొత్త బంగారు లోకం మొదటి సినిమాతోనే పాపులర్ అయ్యింది నటి స్వేతాబసు ప్రసాద్. ఆ తర్వాత రైడ్, కల్వర్, కింగ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించి తెరమరుగైంది. కొత్త బంగారు లోకం’ చిత్రంతో ఎకడా.. అనే డైలాగ్తో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ముంబయికే పరిమిత మయిన ఈ హీరోయిన్ తర్వరలో పెళ్లిపీట లెక్కేందుకు డేట్ ఫిక్స్ చేసింది.
మక్డే’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు.. పలు హిందీ చిత్రాలతో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ప్రస్తుతం పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్వేతా బసు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఫిల్మ్మేకర్ రోహిత్ మిట్టల్ను శ్వేతా వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబరు 13న పుణెలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం.
పెళ్లి తర్వాత అదే వారంలో ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మార్వాడీ, బెంగాలీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. గతంలో కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. సెక్స్ రాకెట్లో మారు మోగిన స్వేతాబసు ప్రసాద్ పేరు ….ఆతర్వాత క్లీన్ చిట్ వచ్చింది.
గత కొంత కాలంగా ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్తో ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ భామ డిసెంబరు 13న పెళ్లి పీటలెక్కనుండి. ఈ పెళ్లి కబురుని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్, ప్రియుడితో కలిసి ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో చేసుకున్న బ్యాచిలర్ పార్టీ ఫోటోలను షేర్ చేసింది.