Friday, May 17, 2024
- Advertisement -

అప్ప‌ట్లో ర‌జ‌నీకాంత్‌కు పంచ్ వేసిన క‌రుణానిధి..!

- Advertisement -

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి నిన్న‌(మంగ‌ళ‌వారం) సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో మ‌ర‌ణించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఆయన మరణవార్త విని తమిళ ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే క‌రుణానిధి రాజ‌కీయ‌ల‌లో ఎంట్రీ ఇవ్వ‌క ముందు ప‌లు సినిమాల‌లో న‌టించి,క‌థ‌ల‌ను అందించార‌ని చాలా కొద్ది మాత్ర‌మే తెలుసు. క‌రుణానిధి ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత కూడా సీని ఇండ‌స్ట్రీతో మంచి సంబంధాలు కొన‌సాగించారు.దీనిలో భాగంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ ,క‌రుణానిధిల మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది.ఒక‌రిపై ఒక‌రు పంచ్‌లు వేసుకునేవారు.

అలాంటి ఓ సంఘటన గుర్తు చేసుకుంటే.. చెన్నైలో జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో రజినీకాంత్, కరుణానిధి పాల్గొన్నారు. ముందుగా మైక్ తీసుకొని మాట్లాడిన రజినీకాంత్ రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘రాజకీయ నాయకులంటే నిప్పు లాంటివారు.. వారు మనకు ఎంత సన్నిహితులైనా సరే ఆ నిప్పుల సెగ తగలకుండా జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. దానికి కరుణానిధి ‘తమ్ముడూ నేను అవినీతికి మాత్రమే నిప్పులాంటివాడిని.. కానీ సేవలో ప్రజల కాలి చెప్పులాంటివాడిని’ అంటూ రజినీకాంత్ కి కౌంటర్ పంచ్ ఇచ్చారు. ఆయన డైలాగ్ తో అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు. కరుణానిధికి మ‌ద్ద‌తుగా ఓ ఎలెక్ష‌న్స్‌లో ర‌జ‌నీకాంత్ త‌న‌ అభిమానుల‌ను ఓట్లు వేయాల‌ని కోరాడు.ఆ ఎన్నిక‌ల‌లో కరుణానిధి విజ‌యం సాధించి మ‌రోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -