‘జబర్దస్త్’ ప్రొగ్రాం టెలివిజన్ కార్యక్రమాలలో సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో నటిస్తున్న నటులకు మంచి పేరు రావడమే కాకుండా ,వీరికి పెద్ద సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.తాజాగా ఈ కార్యక్రమంలో నటించే నటుడికి ఓ అరుదైన గౌరవం దక్కింది. ‘జబర్దస్త్’కామెడీ షో ద్వారా సుధాకర్ తెలుగు ప్రేక్షకులు సుపరిచితుడే. ‘సునామీ’ సుధాకర్గా మంచి పేరు సంపాదించాడు.సుధాకర్కు తమిళనాడులోని కోయంబత్తూరు రాయల్ అకాడమీ ఆర్ట్స్ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డును ప్రకటించింది.
ఈ సెప్టెంబర్ 8న దుబాయిలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో ఈ కమెడియన్కు డాక్టరేట్ ప్రధానం చేయనున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సుధాకర్ తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.సుధాకర్ దేశ వ్యాప్తంగా దాదాపు 5 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చినందుకు గానూ రాయల్ అకాడమీ ఆర్ట్స్ యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సుధాకర్కు డాక్టరేట్ ప్రకటించడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.