ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆన్లైన్లో నమోదు చేయకున్నా కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
60 ఏళ్లు దాటినవారు ఏదైనా ధ్రువపత్రం చూపి టీకా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో శుక్రవారం ఒక్క రోజే 2079 సెషన్ సైట్లలో 9,467 కోమార్బిడిటీ వ్యక్తులకు , 27,065 మంది 60 ఏళ్లు వయసు దాటిన వ్యక్తులకు మొదటి డోసు వేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలియచేసింది.
ఆసుపత్రుల జాబితాను www.cowin.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకుని వ్యాక్సినేషన్కు నమోదు చేసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆన్ లైన్లో పేర్లు నమోదు చేసుకోలేకపోయినా ఆయా కేంద్రాలకు స్వయంగా వెళ్లి టీకా వేయించుకునే అవకాశం ఉందని తెలిపింది.
ఆ రెండు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ.. తాజా పరిస్థితిపై సమీక్షా..!
ఈ శివరాత్రికి ఏమైంది.. రాజన్న కి కుడా నష్టమే..!