Friday, May 17, 2024
- Advertisement -

కోమాలో వెళ్లిన నటుడు నర్సింగ్ యాదవ్‌‌.. ఏం జరిగింది ?

- Advertisement -

టాలీవుడ్ సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ గుర్తున్నారా ? ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. విలన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను టాలీవుడ్ లో సంపాధించుకున్నారు. కొన్ని సినిమాల్లో ఆయన విలన్ గా చేస్తూనే నవ్వించారు. అయితే గత కొద్ది కాలంగా ఆయన సినిమాల్లో కనిపించడం లేదు.

ఆయన ఆరోగ్యం కొద్ది రోజులుగా బాలేకపోవడంతో సినిమాలకు దూరమయ్యారు. అయితే తాజాగా ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

దీనిపై ఆయన భార్య చిత్ర మాట్లాడుతూ.. తన భర్త నిన్న సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లిన మాట నిజమేనని, ప్రస్తుతం కోమాలో ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లు కింద పడి గాయలయ్యాయనే వార్తల్లో నిజం లేదని.. అకస్మాత్తుగా కోమాలోకి వెళ్లిపోయారని వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వాటి నమ్మొద్దని ఆమె కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -