యంగ్ హీరో నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో వచ్చిన ‘కార్తికేయ’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది. ప్రస్తుతం గుజరాత్లో ‘కార్తికేయ 2’ షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ జరుగుతుండగా నిఖిల్ ప్రమాదానికి గురయ్యాడు. యాక్షన్ సీన్ చిత్రికరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో నిఖిల్కి స్వల్ప గాయాలయ్యాయి.. కాలుకి గాయం అవ్వడం వలన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం ఆపివేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
కాగా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుండడం విశేషం. అనుపమ్ కూడా సినిమా చిత్రీకరణలో పాల్గొని తన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ చేశారు.
దేత్తడి హారికా పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్?
మహేష్ తో మూడు సంవత్సరాలు సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళి!