- Advertisement -
తమిళ హీరో విశాల్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.విశాల్ తాజాగా ‘ఇరుంబు తిరై’తో హిట్ కొట్టేశాడు. ఈ సినిమా తరువాత లింగుస్వామి డైరక్షన్లో పందెం కోడి-2 కు ప్లాన్ చేస్తున్నాడు.ఇది పందెం కోడికి సీక్వెల్.ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో లేడి విలన్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం.
ఈ క్యారెక్టర్ కోసం.సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మిని తీసుకున్నారని సమాచారం.గతంలో విశాల్ .. వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం కొనసాగిన విషయం కోలీవుడ్లో అందరికీ తెలిసిందే. పైగా వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్తో కూడా గొడవలు పెట్టుకున్నాడు విశాల్.ఇప్పుడు విశాల్ వరలక్ష్మి కలిసి సినిమా చేయనుండటంతో ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి.