విభిన్నమైన కథలు ఎంపిక చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో విజయాలు అందుకుంటున్న మెగా నటుడు వరుణ్తేజ్. తొలుత కొన్ని సినిమాలు నిరాశ మిగిల్చగా ఆ తర్వాత కోలుకొని హిట్ బాట పట్టాడు. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలు విజయాలు పొందాడు. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో వరుణ్తేజ్ సిద్ధమవుతున్నాడు.
ఇప్పుడు అంతరిక్షంలోనే అడుగుపెట్టబోతున్నాడు. ‘ఘాజీ’ సినిమాతో మంచి హిట్ కొట్టిన యువ దర్శకుడు సంకల్పరెడ్డితో ఓ సినిమాను వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఈ సినిమా అంతరిక్షం నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం కజకస్థాన్ వెళ్లి మరీ తేజ్ శిక్షణ తీసుకోనున్నాడు. జీరో గ్రావిటీ యాక్షన్ సీన్ల కోసం హాలీవుడ్ స్టంట్మెన్ను పిలిపించాడంట. ఇప్పటికే సెట్స్ పైన ఒక స్పేస్ షటిల్ తయారీ కూడా చాలా స్పీడుగా చేస్తున్నారు. భారతదేశంలోనే ఎప్పుడూ రూపొందించని సినిమాను సంకల్పరెడ్డి తీయాలని చేస్తున్నాడు. గతంలో తీసిన ‘ఘాజీ’ సినిమా కూడా అలాంటిదే కావడంతో ఇప్పుడు తీయాలనుకున్న సినిమాపై ఆసక్తి ఏర్పడింది.
జీరో గ్రావిటీ స్పేస్ సీన్స్ కోసం కొందరు ఎక్స్పీరియన్స్ ఉన్న స్టంట్మెన్ను పిలిపించి శిక్షణ ఇస్తున్నారు. వరుణ్ కూడా సినిమా కోసం చాలా మార్పులు చేసుకుంటున్నాడు. వీటితోపాటు సంకల్ప్రెడ్డి కాస్టింగ్, సెట్ పనులలో బిజీగా ఉన్నాడు. రాజీవ్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. స్పేస్ థ్రిల్లర్ జోనర్లో తొలిసారి భారతీయ సినిమా అడుగుపెడుతుండడంతో సంకల్ప్రెడ్డి సినిమా ఎలా తీస్తాడో చూడాలి.