Tuesday, April 23, 2024
- Advertisement -

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

- Advertisement -

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు, కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఆ తర్వాత పలు కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది ఆమని. ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో సినిమా అవకాశాలు బాగానే వచ్చాయని కానీ నటన పరంగా మెళుకువలు తెలియకపోవడంతో కొంతమేర నటించడానికి ఇబ్బంది పడ్డానని ఆ తర్వాత మెల్ల మెల్లగా అంతా సెట్ అయిందని చెప్పింది.

అయితే ఇండస్ట్రీలో తాను పెద్దగా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదని.. కాకపోతే ఓ సారి సినీ ప్రముఖులమని చెప్పుకుంటూ కొంతమంది పెద్దలు అవకాశాల పేరుతో తనని లొంగదీసుకోవాలని చూశారని తెలిపింది. కానీ తాను మాత్రం ఇప్పటివరకు ఆఫర్స్ కోసం ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని చెప్పింది. అంతేగాక సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతలు వేధింపులకు పాల్పడరని కూడా స్పష్టం చేసింది. ఇక చందమామ కథలు సినిమాలో ప్రాముఖ్య పాత్ర పోషించింది. అప్పటి నుంచి మళ్లీ తెలుగు సినిమాల్లో తల్లి పాత్రల్లో నటిస్తోంది ఆమని.

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

జెనీలియా భర్త కదా అని అనేసరి నా ఈగో హర్ట్ అయ్యింది : రితేష్‌

క్రిష్ సినిమా చేయలంటే కండిషన్ పెట్టిన పవన్..

నటి రోహిణి తమ్ముడు టాలీవుడ్ లో పెద్ద విలన్ అని తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -