Sunday, May 5, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ దెబ్బకు లైన్లోకొచ్చిన‌ నిఖిల్

- Advertisement -

టాలీవుడ్ స‌న్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్‌ దేవ‌రకొండ న‌టించిన నోటా సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఈ విష‌యాన్ని విజ‌య్ కూడా ఒప్పుకున్నాడు.ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతు…ఇలాంటివి మ‌ళ్లీ రిపీట్ కానివ్వ‌న‌ని తెలిపాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.అయితే నోటా ప్లాప్‌పై హీరో నిఖిల్ వ్యంగ్యంగా స్పందించాడు.అన్ని రోజులు ఒకేలా ఉండ‌వు బ్ర‌ద‌ర్ అంటూ విజ‌య్‌ను ఉద్దేశించి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు నిఖిల్‌.దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ నిఖిల్‌ను గ‌ట్టిగానే ట్రోల్ చేశారు.దీంతో నిఖిల్ త‌న ట్విట్‌ను తీసేయ‌డం జ‌రిగింది.తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొడం న‌టించిన టాక్సీవాలా సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుంది.

అయితే విడుద‌ల‌కు ముందే సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అయింది.దీంతో చిత్ర యూనిట్ షాక్‌లో ఉంది.వెంట‌నే సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్‌.టాక్సీవాలాకు మ‌ద్ద‌తుగా హీరో నిఖిల్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. టాక్సీవాలా టీమ్ చాలా కష్టపడింది. ఆ డైరక్టర్ నాకు తెలుసు. కష్టపడి సినిమా తీసారు.. కాబట్టి ఆ పైరసీ ప్రింట్ చూడవద్దని థియోటర్స్ కు వచ్చి సినిమా చూడమని చాలాఎమోషనల్ గా అన్నారు. ఈ పోస్ట్ ని రీట్వీట్ చేస్తూ…విజయ్ దేవరకొండ ధాంక్స్ చెప్పారు. మొత్త‌నికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ దెబ్బ‌కు నిఖిల్ లైన్లోకి వ‌చ్చాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -