సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. లైగర్ పేరుతో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరో వైపు రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర శ్రేణి వ్యాపారం ప్రారంభించి అందులో కూడా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో కూడా తనదైన ముద్ర వేసేందుకు రౌడీ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
తాజాగా మల్టిఫ్లెక్స్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన స్వస్థలమైన మహాబూబ్నగర్లో మల్టీప్లెక్స్ను ఏర్పాటు చేసాడు విజయ్. మల్టీప్లెక్స్కు ఎవిడి సినిమాస్ అని పేరు పెట్టారు. ఇప్పటికే AMB సినిమాస్ పేరుతో థియేటర్స్ మొదలు పెట్టి పెద్ద సక్సెస్ అయ్యారు మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్.
ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా కలిసి ఏషియన్ సినిమాస్ వారు మల్టీ ప్లెక్స్ లని నిర్మిస్తున్నారు. అమీర్ పేట్ సత్యం థియేటర్ ను కొనేసి దాని స్థానంలో కొత్త మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ బిజినెస్ లో విజయ్ దేవరకొండ ఎంత సక్సెస్ సాధిస్తారో చూడాలి.