బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన ‘జీరో సినిమా వివాదంలో చిక్కుకుంది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.అందరిని ఆకట్టుకుంటున్న ట్రైలర్ ఓ వివాదంలో చిక్కుకుంది. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సిక్కు గురుద్వార్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ పోలీస్ స్టేషన్లో మంగళవారం నాడు ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
షారుఖ్తో పాటు చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్పై అయన కేసు నమోదు చేశారని సమాచారం. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్(చిన్న కత్తి లేదా పిడి బాకు)ను షారూఖ్ ఈ సినిమాలో ధరించాడని.. సంప్రదాయం ప్రకారం అది అమృతధారి సిక్కులు మాత్రమే ధరించాలని అయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది సిక్కులను కించపరచడమేనని అయన అంటున్నారు. కాబట్టి సిక్కులకు అభ్యంతరకరమైన సన్నివేశాలను ‘జీరో’ సినిమానుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ స్పందించలేదు.