Monday, May 20, 2024
- Advertisement -

కూక‌ట్ ప‌ల్లిలో ఘోర విషాదం..స్కూల్ షెడ్ కూటి ఇద్ద‌రు విద్యార్థ‌లు దుర్మ‌ర‌నం..

- Advertisement -

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఘోర విషాద సంఘటన చోటుచేసుకుంది. వివేకానంద నగర్ కాలనీలో న్యూ సెంచరీ స్కూల్ షెడ్ కూలి పడిపోయింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు విద్యార్థుల్ని ఆస్పత్రికి తరలించారు. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదంలో ఇద్దరు టీచర్లు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తుండగా.. ఆస్పత్రి దగ్గర విషాద వాతావరణం కనిపిస్తోంది. రాత్రి కురిసిన భారీ వర్షం వల్లే షెడ్ కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు

ఆ పాఠశాల ఆవరణలోని రేకుల షెడ్ లో కరాటే క్లాస్ లు నిర్వహిస్తుంటారు. కరాటే క్లాస్ నిమిత్తం విద్యార్థులు ఈరోజు అక్కడికి వెళ్లారు. ఒక్కసారిగా రేకుల షెడ్ కుప్పకూలడం ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా, పాఠశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత రేకుల షెడ్డులో కరాటే క్లాస్ లు నిర్వహించడం వల్లే ఈ సంఘటన జరిగిందని అంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చనిపోయిన పిల్లలు నాలుగో తరగతి చదువుతున్న చందన, మణి కీర్తనలుగా గుర్తించారు. గాయపడిన విద్యార్థుల్ని నిఖిత, నరేష్, సందీప్, సహస్ర, దివ్య శ్రీలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా కరాటే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదంపై స్కూలు యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -