Friday, April 26, 2024
- Advertisement -

నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. నటి గీతాంజలి ఆవేదన!

- Advertisement -

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వేధింపులకు గురికావడం ప్రతిసారి ఎక్కడో అక్కడ వింటూనే ఉన్నాం. ముఖ్యంగా సెలబ్రెటీల ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం చూస్తూనే ఉంటాం. మరికొంత మంది సైబర్ నేరగాళ్లు ట్విట్టర్, ఇన్ స్ట్రా లను హ్యాక్ చేసి అసభ్యకర పోస్టింగులు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా డేటింగ్ యాప్‌లో తన ఫొటోలు పెట్టి వేధిస్తున్నారంటూ సినీ నటి గీతాంజలి వాపోయారు.

తన ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి డబ్బులు సంపాదిస్తున్న పోకిరీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అనేక ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని చెప్పిన నటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగ గీతాంజలి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. ఇలాంటి బాధలు ఏ అమ్మయికీ రాకూడదు అని అన్నారు. దీనిపై ఐపీసీ 501 సెక్షన్ కింద హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఏసీపీ ప్రసాద్‌ తెలిపారు.

‘లైవ్’లో ఫోన్ నెంబర్ ఇచ్చిన శ్రీముఖి.. మీకు తెలుసా?

యాక్షన్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని ‘అగ్ని సిరగుగల్’

మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆక్సిజ‌న్ బ్యాంకులు ప్రారంభం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -