అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభించిన కారు యజమాని హిరేన్ మన్సుఖ్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు కీలక విషయాలు వెల్లడించింది. ఆ కారు యజమాని హిరేన్ కాదని వివరించింది. దాని అసలు యజమాని ఠానేకు చెందిన శ్యామ్ న్యూటన్ అని పేర్కొంది. ఈ మేరకు హిరేన్ మరణించక ముందు పోలీసులకు సమర్పించిన వాంగ్మూలంలో వెల్లడించారని తెలిపింది.
2018 నుంచి ఆ స్కార్పియో వాహనాన్ని మన్సుఖ్ హిరేన్ వినియోగిస్తున్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. కారు డెకరేషన్ వ్యాపారం చేసే హిరేన్కు తన కారును బాగు చేయించాలని శ్యామ్ ఇవ్వగా.. అందుకు రూ.2.8 లక్షల బిల్లును హిరేన్ చేశాడని చెప్పారు.
ఆ డబ్బులను యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు చెక్కుల రూపంలో హిరేన్కు శ్యామ్ అందించగా.. అనంతరం ఆ కారును హీరేన్కు అతడు అప్పగించాడని చెప్పారు. అయితే.. ఆ చెక్కులు రెండూ బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు.
పిల్లలు పుట్టకుండా సింహానికి ఆపరేషన్!