Friday, April 19, 2024
- Advertisement -

మరీ ఇంతపాపమా.. కోడలు ఉరి వేసుకుంటె.. అత్తమామలు అది చేశారు!

- Advertisement -

ఈ మద్య మానవ సంబంధాలు మరీ దారుణంగా మారిపోతున్నాయి. కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్న పిల్లలు.. అనుమానాలతో చంపుకుంటున్న భార్యాభర్తలు.. అక్రమ సంబంధాల వల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా కోడలు ఇంటి మహాలక్ష్మి అంటారు.. తమ కుటుంబం వంశాన్ని నిలిపే దేవత అంటారు. అలాంటి కోడలు ఆత్మహత్య చేసుకుంటుంటే చోద్యం చూడటమే కాదు.. తాము ఏదో గొప్ప పని చేస్తున్నట్టు వీడియో తీసి ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేశారు.

క‌ళ్ల ముందే కోడ‌లు చ‌నిపోతున్నా క‌నిక‌రం లేకుండా వారు పాల్ప‌డ్డ చ‌ర్య ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ లోని ముజఫర్‌ డాటియానా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కోమల్ అనే అమ్మాయితో ఆశిష్ కి 2019 లో వివాహం జరిగింది. గత కొంత కాలంగా వరకట్నం కోసం కోడలిని హింసిస్తూ వచ్చారు.

కొన్ని రోజుల క్రితం భార్య భర్తల మద్య వివాదం తలెత్తడంతో కోడలు తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత గ్రామ పెద్దలు నచ్చజెప్పడంతో అత్తారింటికి వచ్చింది కోమల్. ఆమెను అత్తమామలు మళ్లీ  వేధించడంతో త‌ట్టుకోలేక‌పోయిన ఆమె గ‌దిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమెను ఆప‌కుండా, ఆ దృశ్యాల‌ను కిటికీలో నుంచి చిత్రీకరించిన అత్తామామ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -