Friday, April 26, 2024
- Advertisement -

నడిరోడ్డుపైనే ప్రియుడిని కసితీర పొడిచి చంపేసింది!

- Advertisement -

ఈ మద్య భార్య భర్తల మద్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు చివరికి ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వల్ల దైవ సాక్షిగా ఒక్కటైన జంటల్లో పగలూ ద్వేశాలు సంబవిస్తున్నాయి. తాజాగా ఓ వివాహిత కట్టుకున్న భర్తను నడిరోడ్డుపైనే తన కసితీర పొడిచి చంపేసింది.

వివరాల్లోకి వెళితే.. తాళ్లపూడి మండలంలోని మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత ఏడాదిగా తాతాజీ ని పెళ్లి చేసుకుందాం అంటున్నా ఎదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ వస్తున్నట్లు సమాచారం. చిన్న గ్రామానికి వచ్చిన తాతాజీని కలుసుకున్న పావని మరోసారి ఇదే కోరిక కోరడంతో మళ్లీ వేరొక సాకు చెప్పడంతో కోపం పెంచుకుంది.

ఈ క్రమంలోనే బైక్ వెనుక కూర్చున్న పావని సంచిలో వెంట తెచ్చుకున్న కత్తి తీసి తాతాజీని వెనక నుంచి పొడిచింది. బాధతో కిందపడి విలవిల్లాడుతున్న తాతాజీ మెడ, తల, వీపుపైనా కత్తితో  దాడిచేసింది. తీవ్ర గాయాలపాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -