బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరుగా సీనియర్ నేతలంతా కారు దిగి హస్తం పార్టీలో చేరుతుండగా తాజాగా మరో నేత కాంగ్రెస్లో చేరికకు రంగం సిద్ధమైంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు బొంతు.
ప్రస్తుతం ఆయన భార్య చర్లపల్లి కార్పొరేటర్ గా ఉన్నారు. ఆమె కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత జీహెచ్ఎంసీ తొలి మేయర్ గా పని చేశారు బొంతు రామ్మోహన్. త్వరలో ఎంపీ ఎన్నికలు జరగనుండగా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను ఆశీస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బాబా ఫసియుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. ఒక్కొక్కరుగా ఉద్యమకారులు బీఆర్ఎస్ను వీడుతుండటం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు.