Sunday, May 19, 2024
- Advertisement -

ఆరు గ్యారెంటీలు..ఇలా దరఖాస్తు చేసుకోండి

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహద పడిన వాటిలో ప్రధాన పాత్ర ఆరు గ్యారెంటీలు. ప్రజాకర్షక మేనిఫెస్టోతో ప్రజలకు దగ్గరవడంతో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఇక అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. మహిళలకు ఉచిత రవాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచగా తాజాగా ప్రజా పాలన పేరుతో మిగిలిన గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది.

28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆరు గ్యారంటీల హామీల అమలు ధరఖాస్తు ఫారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,మంత్రి కోమటిరెడ్డి విడుదల చేశారు.

ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా ప్రతి ఇంటికి ధరఖాస్తు ఫారాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ధరఖాస్తులను ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నారు . పట్టణ ప్రాంతాల్లో ఆయా వార్డుల్లో కూడ ప్రజలకు ధరఖాస్తులను అందిస్తారు. గ్రామాల్లో ఏ రోజున గ్రామ సభలు నిర్వహిస్తారో ముందే సమాచారం ఇస్తారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒకే ధరఖాస్తు ఫారం ఉంటుంది.ఈ ధరఖాస్తు ఫారాన్ని నింపి రేషన్ కార్డు, ఆధార్ కార్డు జీరాక్స్ ప్రతులను జత చేసి అధికారులకు అందించాలి.

()మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు రూ. 2500 , రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం కింద అవసరమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆయా గ్యాస్ కంపెనీల పేర్లతో పాటు ఏటా ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమనే వివరాలు వెల్లడించాలి.

()రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ. 15 వేలు అందించనున్నారు. కౌలు రైతా, రైతా అనే వివరాలతో పాటు సాగు చేస్తున్న భూమి వివరాలను కూడా పొందుపర్చాలి.

()గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉచితంగా ప్రకటించింది. ప్రతి నెల ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారనే విషయాన్ని ధరఖాస్తులో నమోదు చేయాలి.

()ఇందిరమ్మ ఇళ్ల కోసం ధరఖాస్తులో అవసరమైన వివరాలను పొందుపర్చాలి. అమర వీరుల కుటుంబాలైతే ఆ వివరాలను ఆ ధరఖాస్తులో చేర్చాలి.ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ఆర్ధిక సహాయం కోరితే ఆ వివరాలను అందించాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసులు, శిక్ష అనుభవిస్తే ఆ వివరాలను కూడ ఆ ధరఖాస్తులో నింపాల్సి ఉంటుంది.

()చేయూత పథకం కింద పెన్షన్ల కు సంబంధించిన సమాచారం అందించాల్సి ఉంటుంది.వృద్దాప్య, వితంతు, దివ్యాంగుల, చేనేత, గీత కార్మికుల పెన్షన్ ను అందించనున్నారు. ఈ ధరఖాస్తుకు సంబంధించి సంబంధిత అధికారులు రశీదును కూడ అందిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -