బీజేపీ నేత ఈటల రాజేందర్ కొంతకాలంగా కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వార్తలు వచ్చిన ప్రతీసారి ఆయన ఖండిస్తున్న రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్గా మారింది.
కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఓ సమాఏశంలో పాల్గొన్నారు ఈటల. ఇందుకు సంబంధించిన ఫోటో లీక్ కాగా నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.
ఇక త్వరలోనే బీజేపీని వీడి ఈటల కాంగ్రెస్ చేరడం ఖాయమని మరోసారి రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఎందుకంటే బీజేపీ విషయంలో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు ఈటల. ఈ నేపథ్యంలో ఇటీవలె కాంగ్రెస్లో చేరిన పట్నంతో ఈటల భేటీ కావడంతో కాంగ్రెస్లో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుండి మల్కాజ్గిరి సీటును ఆశీంచారు ఈటల.కానీ సీటు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇది కూడా పార్టీ మారడానికి ఓ కారణం అని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్ల పోటీ చేశారు ఈటల. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. అప్పటినుండి పెద్దగా మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు లేవు.