తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగలనుందా..?త్వరలో ఎంపి ఎన్నికలు జరగున్న నేపథ్యంలో కీలక నేత పార్టీ వీడేందుకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్ ఆ పార్టీకి కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే ఈటల పార్టీ మారడం ఖాయమనే ప్రచారం కూడా జరింగింది.
అయితే తాజాగా కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ త్వరలోనే హస్తం గూటికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈటల కాంగ్రెస్లో చేరితే కరీంనగర్ ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కరీంనగర్ ఎంపీ పోరు ఆసక్తికరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎందుకంటే కరీంనగర్ నుండి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తిరిగి పోటీ చేసేందుకు బండి ఇప్పటికే గ్రౌండ్ ప్రీపేర్ చేసుకోగా ఈటల ఎంట్రీ వార్ ఇంట్రెస్టింగ్గా మారనుంది. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్. దీనికి తోడు ఈటల పోటీ చేస్తే గెలుపు సులువు అవుతుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈటల వర్సెస్ బండిగా బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోంది. ఈ సమయంలో బండిపై ఈటల పోటికి దిగితే ఖచ్చితంగా ప్రత్యేకమే కానుంది. మరి కొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.