ఎక్కడ కొల్పోయామో..అక్కడే నెగ్గాలి అనే నానుడిని పట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో గాజువాక,భీమవరం రెండు చోట్ల పోటీచేశారు. కానీ రెండు చోట్ల నిరాశే ఎదురైంది. అయితే ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్…తన పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తున్నారు.
అయితే పొత్తులో భాగంగా టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది..ఏయే స్ధానాలను కేటాయిస్తుందనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది.అయితే ఈ సారి పవన్ ఎక్కడి నుండి పోటీచేస్తారనే దానిపై అటు టీడీపీ ఇటు జనసేన నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జనసేన వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సారి భీమవరం నుండే ఎన్నికల బరిలో నిలవనున్నారట పవన్.
గత ఎన్నికల్లో పవన్ ఓటమిని ఛాలెంజ్గా తీసుకున్న జనసైనికులు అప్పటినుండే పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేశారు. క్షేత్రస్ధాయిలో పవన్ వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న ప్రచారాన్ని జరిపారు. ఈసారి పవన్ బరిలోకి దిగితే లక్ష ఓట్లతో గెలిపిస్తామని శపథం చేస్తున్నారు. అంతేగాదు బీమవరం అయితేనే పవన్కి బెస్ట్ ప్లేస్ అని పార్టీ నాయకత్వాన్ని కూడా చెప్పారట. దీంతో పవన్ సైతం ఇక్కడి నుండే బరిలోకి దిగేందుకు మొగ్గుచూపుతుండగా జనసైనికుల అంచనాలు నిజం అయ్యి పవన్ గెలిస్తే పర్వాలేదు కానీ సీన్ రివర్స్ అయితే మాత్రం పవన్ ఆశలు అడియాసలవ్వడం ఖాయం. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ను ఓడించేందుకు భారీగా డబ్బు ఖర్చుపెట్టారు అది ఈసారి మరింత పెరగనుంది. మరి ధన ప్రవాహం ముందు జన సైనిక్స్ ప్రభావం గెలుస్తుందా లేదా వేచిచూడాలి..