Monday, May 6, 2024
- Advertisement -

షర్మిల..పని అంతేనా?

- Advertisement -

రాజకీయాల్లో హత్యలుండవు..ఆత్మహత్యలే ఉంటాయి. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో నాయకులు ఎదగాలంటే ఓపిక చాలా అవసరం. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు వారి పొలిటికల్ కెరీర్‌ని అంతం చేస్తాయి. ఇలా గతంలో ఎంతోమంది రాజకీయ నాయకుల జీవితాల్లో జరిగింది.

ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పరిస్థితిని గమనిస్తే ఇదే అర్థం అవుతోంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్ ప్రశ్నార్థకమై ఏపీలో అడుగుపెట్టింది. అయితే ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలు చేయవచ్చు. అయితే షర్మిల మాటతీరు చూస్తే ఏపీలో కూడా కష్టమేనని అర్ధమవుతోంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ షర్మిలను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా జగన్‌ పై షర్మిల ఆరోపణలు చేస్తుండగా దీనిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే షర్మిల వ్యాఖ్యలను లైట్ తీసుకోమనే జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండకపోవచ్చు. ఈసారి పోరు వైసీపీ – టీడీపీ కూటమి మధ్యే ఉండనుండగా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు చాలా తక్కువ. ఏది ఏమైనా ఏపీ ఎలక్షన్స్ తర్వాత షర్మిల ప్యాకప్ చెప్పక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -