Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీకి ఈ సీట్లలో ఓటమి ఖాయం!

- Advertisement -

ఏపీలో రెండోసారి తిరుగులేని మెజార్టీతో వైసీపీ విజయం సాధించడం ఖాయమని అన్ని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ఇక రెండోసారి జగను సునామీ స్పష్టంగా కనిపిస్తుండగా టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి నెలకొంది.

విజయం కోసం చంద్రబాబు కష్టపడుతుండగా రెబల్స్ తలపోటుతో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు. పెందుర్తిలో బండారు సత్యనారాయణ స్వయంగా చంద్రబాబు బుజ్జగించినా ఫలితం లేకపోయింది.

మాడుగుల సీటు విషయంలో చంద్రబాబు తనకు అన్యాయం చేశారని..మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబల్‌గా దిగడం దాదాపు ఖాయం కాగా ఇది వైసీపీ అభ్యర్థి గెలుపులో సాయం పడనుంది. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీకి రాజీనామా చేయడం దాదాపు ఖాయం కాగా ఇక్కడ అశోకగజపతిరాజు కూతురు ఓటమి కోసం పనిచేయనున్నారు. మొత్తంగా ఉత్తరాంధ్రాలో టీడీపీకి రెబల్స్‌తో పెద్ద తలనొప్పిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -