Tuesday, May 7, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం..వీహెచ్‌ ఫైర్

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు ఆ పార్టీ సినియర్ నేత వి. హన్మంతరావు. మీడియాతో మాట్లాడిన ఆయన…భట్టి తీరును తప్పుబట్టారు. ఖమ్మం లోక్ సభ సీటును తనకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

తొలుత ఖమ్మం పార్లమెంట్ స్థానం తనకే ఇస్తానని చెప్పి…ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేస్తున్నారని, తనకు సీటు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

భట్టి ఇవాళ ఈ స్థానంలో ఉన్నాడంటే తానే కారణమని కానీ అలాంటి తనకే అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీహెచ్‌. పార్టీకోసం, పదవులు ఆశించకుండా పనిచేశానని…ఖమ్మం లోక్ సభ స్థానం నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. చచ్చే వరకు పార్టీలో ఉంటా.. చనిపోయిన తరువాత పార్టీ జెండానాపై ఉంటుందని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -