తాను అభిమన్యుడు కాదు అర్జునిడిని అన్నారు ఏపీ సీఎం జగన్. ఈ సారి జరిగిఏ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందేనన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన జగన్…చంద్రబాబు అండ్ టీంపై నిప్పులు చెరిగారు.
ఈసారి టీడీపీకి 23 సీట్లు కూడా రావన్నారు జగన్. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరని.. ఎన్నికల సమరానికి సై అన్నారు. ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే అన్నారు. వైసీపీది ప్రజల ప్రభుత్వం అని…. మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్తు ఉన్న పార్టీ అని చెప్పుకొచ్చారు.
భీమిలిలో అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.ఇంతమంది కృష్ణుడి రూపంలో అండగా ఉన్నారని…తాను అభిమన్యుడిని కాదని అర్జునుడిని అన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని…. అందుకే దత్తపుత్రుడిపై ఆధారపడ్డాడని తెలిపారు. మేనిఫెస్టోలో 99శాతం హామీలను నెరవేర్చాం. అని… మరో 25ఏళ్ల పాటు మన జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు. అభివృద్ధిని నమ్ముకునే మీ బిడ్డ.. ఎన్నికలకు వెళ్తున్నాడని తెలిపారు.