యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి-2 పూర్తి అయ్యాక వరస సినిమాలు చేయనున్నాడు. ఇందులో భాగంగా ముందుగా సుజిత్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ చిత్రం చేయబోతున్నాడు ప్రభాస్. ఈ చిత్రం కంప్లీట్ అవ్వగానే.. జిల్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో కూడా ఈ చిత్రంలో నటించనున్నాడు. అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చాలా కాలం నుంచి ఒక్క అడుగు అనే చిత్రం చేయాలి అనుకుంటున్నారు.
అయితే సుజీత్ చిత్రం కంప్లీట్ అవ్వగానే కృష్ణంరాజు మూవీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. రాధాకృష్ణనే ఒక్క అడుగు ప్రాజెక్టు కోసం వాడుకుంటారని తెలుస్తోంది. ఛత్రపతిలో ఫేమస్ అయిన ఒక్క అడుగు అనే డైలాగునే టైటిల్ గా మార్చి, ఓ యాక్షన్ సినిమా చేయాలని కృష్ణంరాజు ఎప్పట్నుంచో భావిస్తున్నారు.
సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ పై ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు కృష్ణంరాజు. ఇప్పుడీ టైటిల్ పై కథ, స్క్రీన్ ప్లే రాసే బాధ్యతను రాధాకృష్ణ అప్పగించే అవకాశాలున్నాయి. బాహుబలి-2 కంప్లీట్ అయిన వెంటనే… ప్రభాస్ సినిమాలన్నింటిపై క్లారిటీ వచ్చేస్తుంది.
Related