Monday, May 20, 2024
- Advertisement -

బన్నీపై ఫ్యాన్స్‌ ఫీల్ అవుతున్నారు?

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరైనోడు’. పవర్ ఫుల్ మాస్‍గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోని విడుదల చేసి ఏప్రిల్ 22న సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే చిత్ర నిర్మాతలు మాత్రం సినిమా పాటల విడుదల కోసం ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయకుండా ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంపై బన్నీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడి ఆడియో ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ వార్త తెలిసి బన్నీ నిర్ణయం సరైనది కాదంటున్నారు.

మరి బన్నీ ఫ్యాన్స్ కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో చూడాలి. అయితే చిత్రబృందం ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్, కేథరీన్‍లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -