Wednesday, May 15, 2024
- Advertisement -

ప‌వ‌న్‌, మ‌హేష్‌ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ బ‌న్నీ!

- Advertisement -
bunny fear with that two heros

స‌రైనోడు తో సూపర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. నాలుగు వ‌రుస రూ.50 కోట్ల సినిమాల క్ల‌బ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం బ‌న్నీ త‌న నెక్ట్స్ సినిమాను హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్నాడు. దువ్వాడ జ‌గ‌న్నాథం (డీజే) టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్‌లో రిలీజ్ చేయాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విష‌యంలో బ‌న్నీ ఇద్ద‌రు స్టార్ హీరోలు అయిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబు దెబ్బ‌కు భ‌య‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి బ‌న్నీకి ఏప్రిల్ సీజ‌న్ బాగా క‌లిసొస్తోంది. గ‌త మూడేళ్లుగా తీసుకుంటే వ‌రుస‌గా రేసుగుర్రం – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి – స‌రైనోడు సినిమాలు ఇదే సీజ‌న్‌కు వ‌చ్చి హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాను సైతం త‌న‌కు క‌లిసి వ‌చ్చిన ఏప్రిల్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ వేశాడు.

అయితే మార్చి చివ‌ర్లో ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు సినిమా వ‌స్తోంది. ఏప్రిల్ 14న మ‌హేష్ – మురుగ‌దాస్ మూవీ వ‌స్తోంది. ఆ వెంట‌నే బాహుబ‌లి -2 రెడీగా ఉంది. సో ఈ లెక్క‌న చూస్తే బ‌న్నీ ప‌వ‌న్‌-మ‌హేష్ సినిమాల దెబ్బ‌కు త‌న‌కు అచ్చివ‌చ్చిన ఏప్రిల్ సీజ‌న్లో త‌న సినిమాను రిలీజ్ చేసేందుకు సాహ‌సించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ లెక్క‌న చూస్తే బ‌న్నీ సినిమా ఏ జూన్‌కో వెళ్లిపోక త‌ప్ప‌ద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు. కాటమరాయుడు మార్చి చివరి వారంలో విడుదల కాబోతోంది. అంటే రాయుడి హవా అంతా ఏప్రిల్ లోనే కదా ఉంటుంది. ఇక మేలో బాహుబ‌లి హ‌వా ఉంటుంది. ఇక బ‌న్నీ త‌న సినిమాను ఏ జూన్‌లోనో లేదా జూలైలోనో రిలీజ్ చేయాలి.

Related

  1. ప్రభాస్ ఇంటి గురించి వివరాలు!
  2. టాప్ హీరోల సెంటిమెంట్లు!
  3. యువ‌తితో భ‌ర్త‌ను అడ్డంగా పట్టుకున్న భార్య‌!
  4. చిరు ఎంట్రీ ఇస్తుంటే .. పవన్ ఎగ్జిట్ కానున్నాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -