టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మెగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. తనకంటూ సపరేట్ ఇమేజ్ కోసం కష్టపడుతోన్న సాయి ఎక్కువుగా తన మేనమామలు అయిన మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్కళ్యాణ్లను అనుసరిస్తున్నాడు.
తన సినిమాల్లో మెగాస్టార్ పాత హిట్ పాటలను వరుసగా రీమిక్స్ చేస్తున్నాడు.. ఇప్పటికే గోలిమార్ – గువ్వా గోరింకతో – అందం హిందోళం పాటలను రీమిక్స్ చేసిన సాయి ధరమ్.. ఆ తరువాత ఇక రీమిక్స్లు చేయనంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. తన తాజా చిత్రం విన్నర్ సినిమా ప్రమోషన్స్లో సాయి మాట్లాడుతూ ఇకపై తాను చిరు సినిమాల్లో హిట్ సాంగ్స్ రీమిక్స్ చేయనని చెప్పాడు. అయితే సాయి అలా ఆ మాట అన్నాడో లేదో వెంటనే తన మేనమామ ముందే అబద్ధం ఆడేసి అడ్డంగా బుక్ అయ్యాడు. గురువారం ప్రసారమైన చిరు మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు సాయి గెస్ట్గా వచ్చాడు. ఈ సందర్భంగా తాను రెండు రోజుల క్రితం ఆడిన మాటను తప్పేశాడు. చిరు కెరీర్ లోనే బెస్ట్ మెలోడీ అన్న పేరున్న ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’ పాటను రీమిక్స్ చేయాలనుందంటూ మెగాస్టార్ ముందే ఓపెన్ అయ్యాడు.
{youtube}IG7daFWeaL4{/youtube}
Related