Saturday, May 18, 2024
- Advertisement -

ఇకచాలు.. ఆ అమ్మడు డిసైడ్ అయిపోయింది..

- Advertisement -

మిల్కీ బ్యూటీ సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇప్పటి వరకు చేసింది చాలు… పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చిత్రాలే చేస్తానంటూ చెబుతుంది. అంటే ఇప్పటి వరకు చేసిన పాత్రలలో గ్లామర్ పాత్రలే ఎక్కువగా ఉన్నాయి.వాటితో సంపాదించాల్సింది సంపాదించేసింది. ఇక ఎటొచ్చి పేరు రావడం కోసం చేయాల్సిన రోల్స్ చేయాల్సి ఉంది.అందుకని అటువైపుగా నరక్కువద్దామని చూస్తుంది.దానిలో భాగంగానే అనుష్క,నిత్యామీనన్ మాదిరిగా లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేయాలనుకుంటుంది.

తాను చేసే సినిమాల్లో పర్ ఫార్మెన్స్ తో పాటు ప్యారలల్ గా గ్లామర్ రసం కూడా ఉండాలని కోరుకుంటుంది. అయితే సడన్ గా తమన్నా ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏమై ఉంటుందని చాలామంది వర్రీ అయిపోతున్నారు. దీనంతటికి రీజన్.. టాలీవుడ్ కోలీవుడ్ లలో తాజాగా కొత్త ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇవ్వడమే. వారంతా తొలి చిత్రాలతోనే సక్సెస్ లు కొట్టేస్తూ ఉండడంతో అటువైపుగా హీరోలు పరుగులు పెడుతున్నారు. మెహ్రీన్ ,ఇమాన్యుయల్ తో పాటు పూజా హెగ్డే కూడా టాలీవుడ్ కు వచ్చేయడంతో కాజల్ ,రకుల్ ,రెజీనా లాంటి వారు దిక్కులు చూస్తున్నారు.అందుకు ఆ పరిస్థితి తనకు కూడా వస్తుందని ముందుగానే నిర్మాతలకు ఉప్పందించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -