Saturday, May 18, 2024
- Advertisement -

మంచు మోహన్ బాబుతో.. అనసూయ ఎందుకు రొమాన్స్ చేస్తుందో తెలుసా..?

- Advertisement -

మోహన్ బాబు హీరోగా సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ ని ఎలాంటి గ్యాప్ లేకుండా తొందర తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. ఈ మూవీకి గాయత్రి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

ఈ సినిమా తండ్రీకూతుళ్ల రిలేషన్ అనే థీమ్ తో తెరకెక్కుతోంది. నిఖిలా విమల్ మోహన్ బాబు కూతురుగా నటిస్తోండగా.. ఇప్పుడు ఈ మూవీలో అందాల భామ అనసూయ సడెన్ ఎంట్రీ ఇచ్చింది. అటు యాంకర్ గాను.. ఇటు యాక్టర్ గాను అనసూయ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు మోహన్ బాబు సినిమాలో కీలక పాత్రకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అనసూయది హీరో వెంట ఉండే ఓ జర్నలిస్ట్ పాత్ర. దీని కోసమే అనసూయను అప్రోచ్ కావడం.. ఆమె కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పడం జరిగిందని అంటున్నారు. జర్నలిస్ట్ రోల్ కీలకమే కాకుండా.. హీరో పాత్రతో రొమాన్స్ యాంగిల్ కూడా ఉంటుందట.

అంటే మోహన్ బాబు, అనసూయ పాత్రలపై ఒకట్రెండు పాటలు కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇటు కుర్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ.. అలానే ఐటం సాంగ్స్ చేస్తూ దూసుకెళ్తున్న అనసూయ కి ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు మూవీలో నటించే ఛాన్స్ రావడం అనసూయ చాలా అనందంగా ఉందని తెలుస్తోంది. ఏది ఏమైన మోహన్ బాబు తో రొమాన్స్ కి అనసూయ డేర్ బానే చేసిందని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -