అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా ప్రేమ పెళ్లిలు చేసుకోబోతున్నారు. నాగార్జునకు ఒకేసారి ఇద్దరు కోడల్లు రాబోతున్నారు అంటూ.. అక్కినేని ఫ్యాన్స్ సంబుర పడుతున్న టైంలో అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు రోమ్ లో అఖిల్ పెళ్లి జరగాల్సి ఉంది.
కాని అఖిల్, శ్రియాల మధ్య ఏవో విభేధాలు రావడం వల్ల ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అక్కినేని కుటుంబ సభ్యులు పెళ్లి క్యాన్సిల్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొత్తానికి తనకు అత్యంత సన్నిహితులతో పెళ్లి క్యాన్సిల్ పై నాగార్జున మనస్సు విప్పినట్లుగా తెలుస్తోంది. అఖిల్, శ్రియల మద్య విభేదాల కారణంగా పెళ్లి డేట్ క్యాన్సిల్ అయ్యింది. కాని పెళ్లి క్యాన్సిల్ కాలేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా వారిద్దరి పెళ్లి జరుగుతుందనే నమ్మకంతో నాగార్జున ఉన్నాడు.
{loadmodule mod_custom,Side Ad 1}
కాస్త టైం తీసుకుని అయినా వారిద్దరు మళ్లీ కలుస్తారని తాము భావిస్తున్నట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు. మీడియాలో వస్తున్న వార్తల గురించి పట్టించుకోదల్చుకోలేదని… అఖిల్, శ్రియలను మళ్లీ పెళ్లి పీఠల మీద చూడాలని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. నాగార్జున మాటలను బట్టి చూస్తుంటే పెళ్లి వాయిదా మాత్రమే వేశారని, వారిద్దరి మద్య అపోహలు తొలగి పోయాక పెళ్లి ఉంటుందని అనిపిస్తుంది. కానీ వారిఇద్దరి మధ్య అపోహలు పోవడం అనేది కష్టమే అని సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం అఖిల్ రెండవ సినిమాతో బిజీ అవ్వగా, శ్రియా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ గడిపేస్తుంది. మరి నాగ్ కోరుకున్నట్లుగా వీరిద్దరు కలుస్తారా లేదో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}tpMpdGbKmbE{/youtube}
Related