యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు యంగ్ టైగర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి జై లవ కుశ అనే టైటిల్ అని కూడా ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఎన్టీఅర్ మూడు డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
అందుకోసం ముగ్గురు హీరోయిన్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మూడో హీరోయిన్ కూడా ఎంపిక జరిగింది. ఇప్పటికే ఈ సినిమా కోసం.. రాశి జన్నా, నివేదా థామస్లని ఎంపిక చేసుకోగా, ఇపుడు మూడో హీరోయిన్ను కూడా సెలెక్ట్ చేశాడు.
నిజానికి మూడో హీరోయిన్గా ఓ స్టార్ హీరోయిన్ చేత గెస్ట్ రోల్ చేయించాలని అనుకున్నారు. కానీ, ఇపుడు స్టార్ హీరోయిన్ స్థానంలో యంగ్ హీరోయిన్ నందితని తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ప్రేమకథ చిత్రమ్ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించిన ఈ భామ ఆ తర్వాత చేసిన సినిమాలకు పెద్ద సక్సెస్ కాకపోవడంతో.. పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు నదింత సినిమాలో చాన్స్ రావడంతో తనకు స్టార్ హీరోయిన్ అయ్యే చాన్స్ దక్కిందని అనందపడుతుంది. మరి ఎన్టీఆర్ సినిమా హిట్ కొడితే నందితకు మంచి స్టార్ హీరోయిన్ అయ్యే అవకశం ఉంది.
Related