హీరో నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ…అఅ. ‘ అనే సినిమాలో నటిస్తున్నాడు. నితిన్ సరసన హీరోయిన్ గా సమంత నటిస్తున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మరో సినిమా ఓప్పుకున్నాడట నితిన్.
తాజా సమచారం ప్రకారం తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ‘ఎట్టి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలని ఈ చిత్ర నిర్మాత మైకేల్ రాయప్పన్ అనుకుంటున్నారట. ‘ఎట్టి’ తెలుగులో రీమేక్ నితిన్ ని చెయ్యమని అడిగరట. నితిన్ కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఈ తమిళ్ ‘ఎట్టి’ చిత్రంలో మురళి మెయిన్ ముఖ్యపాత్ర పోశించారు.
రవి అరసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీ దివ్య హీరోయిన్ గా నటిచింది. అదే విధంగా ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చెయ్యలని అనుకుంటున్నారట. ఈ బాలీవుడ్ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారు.
కన్నడ రీమేక్ లో యాష్ హీరో గా నటించనున్నారు. మరి తమిళ్ లో మంచి విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా హీరో నితిన్ కి ఎలాంటి విజయం ఇస్తుందో చూడాలి మరి.