అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న డీజే సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా ట్రైలర్ చేసిది. పలువురు సినీ ప్రముఖులు కూడా డీజే ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగా హీరో పవన్ కళ్యాణ్ కూడా డీజే ట్రైలర్ పై స్పందించాడు.
{loadmodule mod_custom,GA1}
డీజే డైరెక్టర్.. హరిష్ శంకర్ తో ఉన్న ఫ్రెండ్ షిప్తో.. పవన్ కళ్యాణ్ డీజే ట్రైలర్ చూసాడని.. ట్రైలర్ పై ప్రశంసలు కురిపించినట్లు మెగా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్, హరిష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ మూవీ టైంలో డైరెక్టర్ హరిష శంకర్ అంటే.. పవన్ కు అభిమానం స్టార్ట్ ఆయింది. అందుకే హరిష శంకర్ చేసిన ఏ సినిమా అయిన పవన్ ప్రత్యేకంగా తీసుకొని చూస్తాడని.. మెగా వర్గాల వారు అన్నారు. తాజా హరిష్ శంకర్ తెరకెక్కించిన డీజే సినిమాపై కూడా పవన్ ఆసక్తిగా ఉన్నాడు.
{loadmodule mod_custom,GA2}
తాజాగా పవన్ కళ్యాణ్ డీజే ట్రైలర్ చూసి.. అదరగొట్టావు అని.. హరిష్ తో చెప్పాడట. అయితే ఇక్కడ అల్లు అర్జున్ గురించి అసలు మాట్లాడలేదని తెలుస్తోంది. అల్లు హీరోలతో పవన్ కు పెద్దగా సానిహిత్యం లేదు. అందుకే డీజే ట్రైలర్ పై.. కేవలం హరిష్ శంకర్ ని మాత్రమే పవన్ అభినందించాడట. ఇక డీజే సినిమాని దిల్ రాజ్ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 23న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
{youtube}Gc5b4VgY9wc{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related