- Advertisement -
ప్రభాస్ ఏంటి రాంచరణ్ని ఏం అడుగుతాడు అని అనుకుంటున్నారా ? ఏంలేదండీ ప్రభాస్ దగ్గరకి మూడు సంవత్సరాల క్రితం ఓ స్టోరితో జిల్ ఫేమ్ రాధాకృష్ణ వచ్చాడు.స్టోరి నచ్చడంతో తను బాహుబలి సిరీస్ తో పాటు సుజిత్ సాహో చిత్రంతో బిజి బిజిగా ఉండటంతో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తో తీస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్.యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ తో మూవీ చేయాల్సిందిగా సజెస్ట్ చేశాడట. చెర్రీతో తాను మాట్లాడతానని కూడా అన్నాడట.
అయితే ఈ చిత్రాన్ని ప్రభాస్ తోనే తీయాలని పట్టు పట్టాడట రాధాకృష్ణ. ఈ విషయంలో కొంతకాలం పాటు వేచి చూశాడు ప్రభాస్. మూడేళ్ల పాటు ఆ స్టోరీని వేరే వాళ్లకు చెప్పకుండా తనతోనే తీయాలని రాధాకృష్ణ వెయిట్ చేయడంతో తప్పకుండా చేస్తానని మాటిచ్చిన ప్రభాస్ ఇప్పుడు ఆ కమిట్మెంట్ నే పూర్తి చేస్తున్నాడు.