బుల్లి తెరపై జబర్ధస్త్, పటాస్ షోలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ రెండు షోస్ ఎంత బాగా క్రేజ్ తెచ్చుకున్నాయో.. అలానే విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండు షోస్ బూతు కామెడీతో.. చిన్నపిల్లలను పాడు చేస్తున్నాయని.. విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో ఈ రెండు షోల ప్రొడక్షన్ సంస్థ అయిన మల్లెమాల వారు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
జబర్దస్త్ స్థాయిలో పటాస్ షోకు లాభాలు రావడం లేదు. దానికి తోడు శ్రీముఖి, రవిల ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పటాస్ పై వస్తున్న విమర్శలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సమయంలో మొత్తంగా పటాస్ షోను నిలిపేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ స్థాయిలో ఈ టీవీ ప్లస్ లో ఒక మంచి ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాన్ని తీసుకు రావాలని మల్లెమాల వారు భావిస్తున్నారు. ఆ షోలో కొత్త యాంకర్ ఉదయ్ అనే యాంకర్ తో ఓ కొత్త ప్రోగ్రాం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెల తర్వాత పటాస్ షూటింగ్ ను ఆపివేయాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఇప్పటికే చిత్రీకరించిన ఎపిసోడ్ లు రెండు వారల పాటు ప్రసారం అవుతాయి. ఆ తర్వాత ఆ స్థానంలో కొత్త కార్యక్రమం వచ్చే ఛాన్స్ ఉంది. పటాస్ షో నిలిచి పోతే ప్రేక్షకులకు శ్రీముఖి అందాలను చూసే అవకాశం కోల్పోతారు. ప్రస్తుతం పటాస్ లోనే ఎక్కువ గా కనిపించే శ్రీముఖి ఆ తర్వాత కార్యక్రమంలో అయినా ఇంత క్రేజ్ తెచ్చుకుంటుందా అంటే అనుమానమే. దాంతో మెల్ల మెల్లగా శ్రీముఖి కూడా కనిపించకుండా పోవడం ఖాయం అంటున్నారు.
{youtube}fRUqz_K8JDY{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related