పరిశ్రమలో హీరో, హీరోయిన్స్ కి గొడవలు ఉండటం మామూలే. కొందరు ఆ గొడవల వల్ల ఆ హీరో నటించిన సినిమాలో నటించరు. అయితే అలాంటే విబేధాలు వెంకటేష్గారితో రోజా కి ఉన్నాయి. వెంకటేష్ తో ‘పోకిరిరాజా’ అనే ఒక్క సినిమా చేసిన రోజా.. ఆ తర్వా వెంకటేష్ తో చెయలేదు.
రోజా భర్తకు చిరు, బాలయ్య నాగర్జున మంచి ఫ్రెండ్స్. కానీ వెంకీతో మూవీ చేయడానికి ఆయన ఒప్పుకోలేదట. సెల్వమణి దర్శకత్వంలో వెంకటేష్, విజయశాంతి సినిమా ఓపెనింగ్ భారీగా జరిగిందట. అయితే ఆ సినిమా కోసం సెల్వ లొకేషన్లు చూసే పనిలో ఉన్నాడట. ఇంతలో కోలీవుడ్ లో ‘చినగౌండర్’ రిలీజ్ అవ్వడం దాని హక్కులు కొనేసి వాళ్లు బి.గోపాల్గారితో వెళ్లిపోవడం జరిగింది. దాంతో సెల్వ చాలా బాధపడ్డాడు. అవమానంగా ఫీలయ్యారు. ఆ తర్వాత కొన్నేళ్లకు వెంకీతో పోకిరిరాజా చేయడానికి రోజా ఒప్పుకుంది.
{loadmodule mod_custom,Side Ad 1}
అయితే షూటింగ్ అయిపోయాక.. ఓ చిన్న సాంగ్ బిట్ కోసం బెంగళూర్ కి రోజాని రమ్మనారట. అయితే ఆ రోజు అక్టోబర్ 22. సెల్వ పుట్టినరోజు. దాంతో రోజా.. ఎలా అయిన చెన్నయ్ వెళ్లాలని.. వెళ్లిపోయిందట. వెంకటేష్ షూట్ కి రమ్మన్నారని రోజాకి ఫోన్ వచ్చిందట. దాంతో రోజా.. సెల్వ కన్న.. సినిమాలు ఎక్కువ కాదని ఫోన్ పెట్టేసిందట. దాంతో అప్పటి నుంచి వేకంటేష్, రోజా ల మధ్య మాటలు లేవట. సో వెంకీ, రోజాల మధ్య లేకపోవడానికి అసలు కారణం ఇదే.
{loadmodule mod_sp_social,Follow Us}
Related