హైదరాబాద్ భామ రీతు వర్మ మూడు సంవత్సరాలు గా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడం కోసం తన ప్రయత్నాలు చేస్తోంది. ప్రేమ ఇష్క్ కాదల్ .. నా రాకుమారుడు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా మెరిసిన ఆమె అడపా దడపా పెద్ద హీరోయిన్ లకి ఫ్రెండ్ గా చెల్లిగా చేసింది.
ఈమె పెళ్లి చూపులు దెబ్బతో అందరి చూపూ తనవైపు తిప్పెసుకుంది. ఇప్పుడు ఈమెకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అని అందరూ ఒప్పుకుంటారు. దాన్ని కరెక్ట్ గా క్యాష్ చేసుకునేలా స్టెప్స్ వేస్తోందట. పెళ్లి చూపులు రిలీజ్ కి ముందే వేరే సినిమాలు చేసేందుకు ఒప్పుకున్న రీతువర్మ.. ఇప్పుడా సినిమాల నిర్మాతలకు చుక్కలు చూపించేస్తోందట. ఒకవైపు రెమ్యూనరేషన్ పెంచడంతో.. అబ్జెక్షన్స్ కూడా పెట్టేస్తోందని తెలుస్తోంది.
పెళ్లి చూపులు రిలీజ్ కాకముందు.. అడివి శేష్ హీరోగా రూపొందే సినిమాకి రీతు సైన్ చేసింది. ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. అడివి శేష్ సినిమాకి ఈమె నో చెప్పేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
Related