టాలీవుడ్లో కొద్ది రోజులు క్రితం అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయిన వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. చాలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్, శ్రియాలు.. ఆ తర్వాత తీవ్రస్థాయిలో మనస్పర్థలు రావడంతో వీరి ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు వెళ్లలేదు. అఖిల్ చాలా చిన్న వయసులోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ‘జీవీకే’ మనవరాలు అయిన శ్రియభూపాల్తో ప్రేమలో పడ్డాడు.
అఖిల్ కంటే శ్రియా నాలుగేళ్లు పెద్దది.. అయినప్పటికి నాగార్జున వీరి పెళ్లికి ఓకే చెప్పాడు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక త్వరలోనే పెళ్లి అనుకుంటున్న టైంలో వీరు విడిపోయారు. ఈ ఇద్దరి పెళ్లి క్యాన్సిల్పై పలు రూమర్స్ వచ్చాయి. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే జీవీకే ఫ్యామిలీ శ్రియాభూపాల్కు మరో సంబంధం చూసిందట. అమెరికాలో సెటిల్ అయిన ఓ ఎన్నారై ఫ్యామిలీ యువకుడితో ఆమె పెళ్లి ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.
ఆ యువకుడికి అక్కినేని ఫ్యామిలీ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని టాక్. అఖిల్ కంటే శ్రియాకు అతడే కరెక్ట్ అని కూడా జీవీకే భావిస్తోందట. ఈ సంవత్సరం ఆ యువకుడితో శ్రియా పెళ్లి ఉంటుందని సమాచారం. ఏదేమైనా అఖిల్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న వెంటనే శ్రియా మరో పెళ్లికి రెడీ అవ్వడం అఖిల్కు పెద్ద షాక్ లాంటిదే.
{youtube}NSCMNs8rpv0{/youtube}
Related