తెలుగులో సీనియర్ యాంకర్లు అయిన ఉదయభాను, సునీత మధ్య ఏవో విబేధాలు ఉన్నట్లు కొద్ది రోజులు గా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లు ఇలా ఉంటే.. రీసెంట్ గా ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా సింగర్ సునీత తీరును విమర్శించింది. ఆమెరికా టూర్ లో ఓ సింగర్ తనని అవమానించిందని.. కనీసం తనని స్టేజ్ మీదకు కూడా పిలవలేదని చెప్పింది. అలాగే తాను స్టేజ్ మీదకు వెళుతుంటే ఆమె మ్యుజీషియన్స్ స్యాడ్ మ్యూజిక్ ప్లే చేశారని ఉదయభాను వాపోయింది.
అయితే ఉదయభాను ఈ ఇంటర్వ్యూలో సునీత పేరు మాత్రం డైరెక్ట్గా చెప్పలేదు. అయితే సునీత ఆ ఇంటర్వ్యూపై తాజాగా స్పందించింది. ఉదయభాను తన పేరు చెప్పకపోయినా ఆమె చెప్పింది తన గురించే అని తనకు అర్థమైందని…వాస్తవానికి ఉదయభాను నా గురించి అపార్థం చేసుకుందని సునీత్ చెప్పింది. ఆ ప్రోగ్రామ్ తనది..దానికి ఆమెను తాను ఆహ్వానించలేదని..ఆర్గనైజర్లు పిలిచారని..ఆమెను స్టేజ్మీదకు ఆహ్వానించాల్సిన బాధ్యత వాళ్లదే అని చెప్పింది.
ఆ తర్వాత ఉదయభానును పలు సందర్భాల్లో తాను కలిశానని..ఆమెతో ఎన్నోసార్లు మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆమె మాత్రం నాతో మాట్లాడేది కాదు. ఏమైందో నాకు అర్థమయ్యేది కాదు. మొన్న ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన తర్వాతే ఆమె కోపానికి కారణం తెలిసింది. అంత చిన్న ఇన్సిడెంట్ను కూడా ఆమె మనసులో పెట్టేసుకుందని సునీత వాపోయింది.
Related
- ఎఫైర్పై సింగర్ సునీత కామెంట్
- పవన్కు ఊహించని షాక్ ఇచ్చిన సునీల్!
- “రాగం” సింగర్ సునిత నిజజీవితమేనా?
- పవన్ కళ్యాణ్ స్నేహితుడుగా సునీల్!