Thursday, May 16, 2024
- Advertisement -

‘ఉన్నది ఒకటే జిందగీ’ సెన్సార్ రివ్యూ.. మరో హిట్ ఖయామేనా..?

- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా.. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. ‘నేను శైలజా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్, ఆడియో రిలీజ్ అయింది.

వీటికి మంచి స్పందన కూడా లభించింది. ఫ్రెండ్‌షిప్, లవ్ ప్రధాన అంశాలతో రూపొందడంతో ఆ రెండు కేటగిరీస్‌కి చెందిన ఆడియెన్స్ ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మూవీలో మంచి ఉంటుందని, ‘నేను శైలజా’ కాంబో మరోసారి అలరిస్తుందని భావిస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని సెన్సార్ టాక్. అన్నీ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఇందులో అసభ్యత, వయోలెన్స్ సీన్లు లేకపోవడంతో బోర్డు ఈ చిత్రానికి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారి చేసింది. అంతేకాదు.. పాజిటివ్ రిపోర్ట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ‘ఫ్రెండ్‌షిప్’ అనే నేపథ్యమే ఆయువుపట్టు అని తెలుస్తోంది.

ఈతరం కుర్రాళ్లకు మంచి మెసేజ్ ఇస్తూ ఈ చిత్రంలో ఫ్రెండ్‌షిప్‌ని చాలా బాగా చూపించారని, అలాగే ప్రేమకథని కూడా యూత్‌ ఎట్రాక్ట్ అయ్యేలా డైరెక్టర్ సినిమాని తీసారని అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిషా ఆంబ్రోస్ క్యామియో రోల్ చేస్తోంది. అక్టోబర్ 27వ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=kDqawj_1ygU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -