హైదరాబాద్లో యువత మత్తులో మునిగి తెలుతున్నారు.డ్రగ్స్,మద్యం,అమ్మాయిల మోజులో తమ విలువైన జీవితాన్ని చెడగొట్టుకొంటున్నారు.సంపన్నల కుమారులు తమ విలసవంతమైన జీవితాన్ని డబ్బుతో ఖర్చు పెడుతున్నారు.అటువంటి సంఘటనే హైదరాబాద్లో జరిగింది.స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా అతడి స్నేహితులంతా కలిసి ఓ ఫాంహౌస్లో యువతలతో పార్టీ చేసుకున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులు తొక్కారు. తాగిన మత్తులో ఒకరినొకరు కొట్టుకుంటూ.. యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఈ గొడవ… పోలీసులకు పట్టించేలా చేసింది. ఈ ఘటన మరెక్కడో కాదు, హైదరాబాదులోని శంషాబాద్లో చోటు చేసుకుంది.
నగరంలోని పాతబస్తీకి చెందిన వ్యక్తి (20) పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితుడు సాయంతో శంషాబాద్ నుంచి మామిడిపల్లికి వెళ్లే దారిలో ఉన్న ఫాంహౌస్లో పార్టీ ఏర్పాటు చేశాడు.ఈ సందర్భంగా మొగల్ పురా నుంచి ముగ్గురు మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత కొందరు స్నేహితులు పార్టీని ఆపేద్దామని సూచించగా, మరికొందరు కొనసాగించాలని వాదించారు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. కొందరు డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ ముగ్గరు యువతులు భయంతో… తమను అక్కడికి తీసుకొచ్చిన ఆటో డ్రైవర్కు ఈ విషయం చెప్పి పారిపోడానికి ప్రయత్నించారు.ఇది తెలిసిన అతని స్నేహితులు ఆ ఆటోను వెంబడించారు. మామిడిపల్లి రోడ్డులో ఆటోను అటకాయించి డ్రైవర్ను చితకబాదారు. అదే సమయంలో అక్కడ గస్తీ తిరుగుతున్న పహాడీషరీఫ్ పోలీసులు గమనించారు. ముగ్గురు యువతలతోపాటు మరో ముగ్గురు యువకులని అదుపులోకి తీసుకున్నారు.
https://www.youtube.com/watch?v=gxhOHvtVc90